Another Kiosk Machine Donated To Ttd: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళాలు అందించేందుకు కియోస్క్ మెషీన్లను అందుబాటులోకి తెచ్చింది. తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయానికి సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా ఒక యంత్రాన్ని అందజేసింది. తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా ఇచ్చారు.