తిరుమలలో మరో కొత్త మోసం వెలుగుచూసింది. వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో పుణె భక్తులను దళారి మోసగించిన వైనం బయటపడింది. వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో పుణె భక్తుల నుంచి రూ.70 వేలు వసూలు చేసిన దళారి.. తిరుమలకు వచ్చేసరికి వారికి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ కింద దర్శనానికి పంపారు. దీంతో మోసపోయామంటూ పుణె భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.