Tirumala Devotees Darshan Heavy Rush: విద్యాసంస్థలకు సెలవులు, క్రిస్మస్, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలిపిరి వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు బారులు తీరగా, 8 వేల టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు.