Tirumala Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో భక్తులు పోటెత్తారు. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాల తనిఖీ ఆలస్యం కావడంతో గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. దర్శనం టికెట్లు ఉన్నవారు సైతం ఇబ్బంది పడుతున్నారు. టీటీడీ ఏర్పాట్లు చేసినప్పటికీ, రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. భక్తులు రద్దీని గమనించి తిరుమలకు ప్రయాణాలు చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.