Tirumala Devotees PAC 5 Building Accommodation: వేసవి సెలవులు, వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అప్రమత్తమైంది. క్యూలైన్లలో అన్నప్రసాద పంపిణీ కోసం మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశారు. త్వరలో పీఏసీ-5 భవనం అందుబాటులోకి రానుందని, దీని ద్వారా 5 వేల మందికి వసతి కల్పించగలమని టీటీడీ తెలిపింది.