Tirumala Devotee Died In Srivari Mettu: తిరుమలలో విషాదం జరిగింది.. శ్రీవారి దర్శనం కోసం నడిచి వెళుతున్న భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన భక్తుడు వెంకటేష్ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి తిరుమలకు వెళుతున్నారు. అయితే మధ్యలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యం అందించారు. అయితే కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.