Tirumala Assembly Estimate Committee Review: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ ప్రశంసించింది. సేవల్లో నాణ్యతను మరింత పెంచాలని, డిజిటల్ మీడియాను బలోపేతం చేయాలని సూచించింది. పాత భవనాల స్థానంలో కొత్త వాటి నిర్మాణం హైకోర్టు నిబంధనల ప్రకారమే జరుగుతోందని టీటీడీ ఈవో తెలిపారు. హిందూ ఆలయాలకు ఐదడుగుల లోపు రాతి విగ్రహాలను ఉచితంగా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. వసతి గదుల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.