తిరుమలలో స్వర్ణ రథంపై ఊరేగిన శ్రీవారు.. వైకుంఠ ఏకాదశి కావడంతో

1 year ago 21
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ దేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల నడుమ శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం.
Read Entire Article