Tirumala High Alert: జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో వాహనాలు, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీవారి ఆలయ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది. ఆలయ సిబ్బందితో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహణ కూడా జరుగుతోంది.