Tirumala Lost Belongings Returned To Devotee: తిరుమలలో భక్తులు మరచిపోయిన విలువైన వస్తువులను టీటీడీ సిబ్బంది తిరిగి అప్పగించడంలో తమ నిబద్ధతను చాటుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన భక్తుడు గదిలో రూ.1.10 లక్షల విలువైన బంగారు బ్రాస్ లెట్, పర్స్ మరిచిపోగా, సిబ్బంది వెంటనే గుర్తించి అందజేశారు. మరోవైపు, తిరుమలనంబి అవతార మహోత్సవం ఆగస్టు 30, 31 తేదీల్లో వైభవంగా జరగనుంది. ఆకాశగంగ తీర్థం విశిష్టతను కూడా తెలియజేశారు.