తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయటంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఏఐసీసీ ఆదేశాలు, రాహుల్ సూచన మేరకే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు చెప్పారు. పార్టీ లైన్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులకు హెచ్చరించారు.