కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ లైన్ క్రాస్ చేసి.. కులగణన సర్వేపై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో పాటుగా తగులబెట్టడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మంత్రి సీతక్క కూడా కీలక కామెంట్స్ చేశారు. మల్లన్న అలా మాట్లాడటం బాధగా ఉందని.. ఆయనపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.