హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణకు వెళ్లేవారికి శుభవార్త. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్పేట్, డెయిరీఫాం వరకు రెండు కీలక ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. రక్షణ శాఖ భూములను హెచ్ఎండీఏకు అప్పగించడంతో, త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరి సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణం సులభతరం అవుతుంది.