వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కిరాక్ ఆర్పీ ఇమిటేట్ చేసిన తీరుపై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణకు కిరాక్ ఆర్పీ క్షమాపణలు తెలిపారు. బొత్స సత్యనారాయణను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న కిరాక్ ఆర్పీ.. ఏదేమైనా బొత్స సత్యనారాయణకు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నట్లు తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలపై గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ వారితో సారీ చెప్పించాలని డిమాండ్ చేశారు.