కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తుని గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అతను టీడీపీ పార్టీకి చెందిన వాడేనని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన నారా లోకేష్.. ఇలాంటి వాటికి పాల్పడిన వాడెవడైనా ఉక్కుపాదంతో అణిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హాస్టల్స్, గురుకుల పాఠశాలలోని విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు.