కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీ ఎన్నికల ముందు.. మహిళలకు కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హామీ ఇచ్చే నాటికి బంగారం ధర రూ.50 వేలుంటే, ఇప్పుడు రూ.1.50 లక్షలకు పెరిగిందని, అందుకే అమలుకు సమయం పడుతోందని తెలిపారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రైతు భరోసా వంటి కీలక హామీలు నెరవేర్చామని, మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వివరాలు..