ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చర్చ మళ్ళీ మొదలైంది. శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. విశాఖలో కలిస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో భోగాపురం విమానాశ్రయం రానుండటంతో విశాఖలో విలీనం కోసం ప్రజలు పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ వెనక కారణాలు ఏంటి అనే వివరాల కోసం..