వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల విభజనపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కలపాలనే ప్రతిపాదనలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు పంపారు. త్వరలోనే ఈ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాల విలీన అంశంపై ప్రజలు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. ఆ వివరాలు..