చికెన్ ధరలు ప్రతీ రోజు మారుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఏ రోజు ఏ ధర ఉంటుందో తెలియదు. ఇలానే స్థిరంగా ఉండాల్సిన బస్సు ఛార్జీలు ప్రతీ రోజు మారుతున్నాయని తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాఖీ పండుగ వేల తమ సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఊర్లకు వెళ్లిన సోదరులకు భారీ షాక్ తగిలింది. రూ.100 ఉండాల్సిన బస్సు ఛార్జీలు దాదాపు 70 శాతం వరకు కొన్ని ఏరియాల్లో పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.