తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మే 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోవడంతో కార్మిక సంఘాల జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. సమ్మెకు ముందు మే 5న కార్మిక కవాతు నిర్వహించనున్నారు. ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, ఉద్యోగులకు సమాన వేతనాలు వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని జేఏసీ కోరుతోంది.