తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను విద్యాశాఖ ఖండించింది. జవాబు పత్రాల మూల్యాంకనం ఆధారంగా ప్రతి ఏటా ఫలితాల తేదీలు మారుతుంటాయని, ఈ ఏడాది కూడా షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలవుతాయని స్పష్టం చేసింది. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు వచ్చిన దాఖలాలు లేవని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక ప్రకటనలనే నమ్మాలని.. తప్పుడు ప్రచారాలను విశ్వసించవద్దని ట్విట్టర్ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసింది.