తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్. ఆధార్ అప్డేట్ల కోసం ఇక నుంచి ఆధార్ సెంటర్లలో క్యూ కట్టాల్సిన పనిలేదు. తపాలా శాఖ, ఇంటర్ బోర్డు, UIDAI సంయుక్తంగా జూనియర్ కళాశాలల్లోనే ఆధార్ మేళాలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం కాచిగూడ కళాశాలలో ప్రారంభమైన ఈ శిబిరాలు అన్ని జూనియర్ కళాశాలల్లోనూ కొనసాగుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆధార్ వివరాలను నవీకరించుకోవచ్చు లేదా కొత్తవి పొందవచ్చు. ఇది విద్యార్థులకు సమయం, డబ్బు ఆదా చేస్తుందని అధికారులు తెలిపారు.