తెలంగాణ ఉద్యాన వర్సిటీ కొత్త పథకం.. ఆ రైతులకు పూర్తిగా ఉచితం

8 months ago 12
తెలంగాణలోని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ రైతులకు తీపి కబురు చెప్పింది. ఆయా రైతులకు సోనాలి జాతి కోడి పిల్లలను ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతుల అదనపు ఆదాయం కోసం ఉద్దేశించినదని అధికారులు తెలిపారు. తొలి విడతలో మహబూబాబాద్, ములుగు, నల్గొండ జిల్లాల్లో, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఒక్కో రైతుకు 10 కోడి పిల్లలు అందజేస్తారు. ఇవి త్వరగా పెరిగి గుడ్లు, మాంసం ద్వారా రైతులకు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి.
Read Entire Article