తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రకటించాయి. మెుత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అసెంబ్లీ సంఖ్యా బలాల ప్రకారం నాలుగు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ దక్కించుకోనుంది. ఈ మేరకు కాంగ్రెస్ ముగ్గుర్ని ప్రకటించగా.. పొత్తులో భాగంగా ఓ సీటుని సీపీఐకి కేటాయించింది. బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నలుగుర్ని పదవులు వరించనున్నాయి.