ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన వేళ.. తాజాగా కేంద్రమంత్రి శోభా కరంద్లాజే స్పందించారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలు నొచ్చుకుంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. మరోవైపు.. తేజస్వీ సూర్య మాత్రం తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.