తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ముగ్గురు ఐపీఎస్లను వెంటనే రిలీవ్ చేయాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ను కేంద్ర హోం శాఖ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఫిబ్రవరి 21న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే.. కేంద్రం ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ఐపీఎస్ అభిషేక్ మహంతి హైకోర్టును ఆశ్రయించారు. అభిషేక్ మహంతి వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కీలక ఆదేశాలు జారీ చేసింది.