ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు 19 కేబినెట్ సమావేశాల్లో 321 అంశాలకు ఆమోదం తెలపగా, 96 శాతం అమలు చేశామని మంత్రులు వెల్లడించారు. అమిటీ, సెంచరీ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లను యూనివర్సిటీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు, వీటిలో 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు.