గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 4.5 లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలోనే ప్రత్యేక బోర్డు, కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్, కర్ణాటక తరహాలో ఈ చట్టం రూపొందుతుందని.. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామన్నారు.