తెలంగాణ జాగృతి ఒత్తిడికి ప్రభుత్వం దిగొచ్చింది.. ఇది మా విజయం, కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్

8 months ago 6
భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ప్రస్తుతం ఏపీలో అతర్భాగంగా ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆ ఐదు గ్రామాల ప్రజలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని ఆమె ట్వీట్ చేశారు. ఐదు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం వంటి అవసరాల కోసం నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కవిత పేర్కొన్నారు. వారి దుస్థితిపై తెలంగాణ జాగృతి ఈ నెల 20న నిర్వహించిన 'పోలవరం - తెలంగాణపై జలఖడ్గం' రౌండ్ టేబుల్ సమావేశం తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆమె తెలిపారు.
Read Entire Article