తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. డిసెంబర్ 09వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని.. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్కు రేవంత్ రెడ్డి సర్కారు తరపున అధికారికంగా ఆహ్వానం అందించనున్నారు.