తెలంగాణలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో.. మరో ఇంట్రెస్టింగ్ సీన్ ఏర్పడింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. కాగా.. ఈ భేటీ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారన్నది ఉత్కంఠగా మారింది.