ఈ ఏడాది జూన్లో పాశమైలారం సిగాచీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. సిగాచీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో బాధ్యులను గుర్తించలేదు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికీ బాధ్యలను గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించింది. దీనిపై ఏఏజీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా తదుపరి విచారణలో దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.