తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మాడు పగిలే ఎండలు రాష్ట్ర ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి చివరి వారం నుంచి ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని.. ఏఫ్రిల్, మే నెలల్లో అయితే నిప్పుల కుంపటే అని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మధ్యాహ్నం సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.