తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రెండు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం కురిసే ఛాన్సుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత జల్లులు కురుస్తాయన్నారు.