తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒకేసారి 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలో నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ మేరకు శనివారం కీలక సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, హైవేలు ఇతర ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను సేకరించారు.