రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది, ఉదయం నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే, ఈ వేడి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాల్లో వర్షాల సూచనలు ఇచ్చింది. వాతావరణ శాఖ ప్రకారం బుధవారం (ఏప్రిల్ 02వ తేదీ) నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ వర్షాలు కొంత మేరకు వేడి తీవ్రతను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.