ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నల్గొండ, యాదాద్రి-భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.