రిపబ్లిక్ డే వేడుకల వేళ తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిన వెంటనే లబ్ధిదారులందరికీ ఉచితంగా సన్న బియ్యం ఇస్తామని అన్నారు.