తెలంగాణ సర్కార్ ఉగాది కానుకగా నేడు పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించనుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇస్తుండగా.. వాటిని చాలా అమ్ముకుంటున్నారు. అదనంగా ఖర్చు చేసి సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇక నుంచి అదనపు ఖర్చు లేకుండా ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేయనుంది.