నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం పరిసరాల్లోని దోమలపెంట, ఈగలపెంట గ్రామాల పేర్లను మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దోమలపెంటను బ్రహ్మగిరిగా, ఈగలపెంటను కృష్ణగిరిగా మారుస్తూ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రకటన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి.. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతనిస్తామని ఆయన తెలిపారు. శ్రీశైలం నుండి బ్రహ్మగిరికి బస్సు సర్వీసు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.