తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేసింది. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలపై సూచనలు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ..