3rd DISCOM in Telangana: తెలంగాణలో విద్యుత్ రంగంలో మార్పులకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వ్యవసాయం, గృహజ్యోతి, ప్రభుత్వ సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తుంది. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపుసెట్లు అందించనున్నారు.