తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. హైకోర్టు స్టేను నిరసిస్తూ.. రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుండగా.. చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.