తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు కీలక పదవి.. ఈసారి జాతీయ స్థాయిలో.. ఉత్తర్వులు జారీ..!

1 year ago 27
తెలంగాణ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్‌కు బీజేపీ అధిష్ఠానం.. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చింది. ఇప్పటికే యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన లక్ష్మణ్‌కు జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమించింది. త్వరలో జరగనున్న బీజేపీ సంస్థాగత ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు, కో రిటర్నింగ్ అధికారలను అధిష్ఠానం నియమించగా.. అందులో తెలంగాణ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్‌ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article