తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు నియమితులయ్యారు. కిషన్ రెడ్డి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రాంచందర్ రావు ఆరెస్సెస్, ఏబీవీపీల్లో పనిచేయడంతోపాటు, పార్టీకి విధేయుడు, వివాదరహితుడనే ముద్ర ఉండటంతో అధిష్టానం ఆయన్ను ఎంపిక చేసింది. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న రాంచందర్ రావు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. ఆయనకు క్షేత్రస్థాయిలోనూ అందరితో బలమైన సంబంధాలు ఉండటం బీజేపీకి కలిసి రానుంది.