తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల పండుగ సందడి మొదలైంది. జూలై 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. భక్తుల భద్రత కోసం 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు. లష్కర్ బోనాలుగా పిలిచే ఈ వేడుకలు నెల రోజుల పాటు వైభవంగా జరుగుతాయి.