ఆషాఢమాసంలో భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. ఈసారి కర్ణాటక నుండి ఒక ప్రత్యేక అతిథి రానుంది! ఎవరా అని ఆలోచిస్తున్నారా? కర్ణాటక నుండి లక్ష్మి అనే 33 ఏళ్ల ఏనుగు అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడానికి వస్తోంది. జూలై 12న తెలంగాణకు రానున్న లక్ష్మి, సికింద్రాబాద్, సబ్జీ మండి ప్రాంతాల్లో జరిగే ఊరేగింపులో సందడి చేయనుంది. ఈ బోనాల జాతరలో లక్ష్మి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.