Mallikarjun Kharge in Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరా తీశారు. మంత్రి పదవుల కోసం సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్రావు, సుదర్శన్రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు ఖర్గేను కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు. అయితే, ఖర్గే మాత్రం ఎవరికీ హామీ ఇవ్వలేదని సమాచారం. కేబినెట్ కూర్పుపై ఆరా తీసిన ఖర్గే, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.