తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో విస్తరణ ఉంటుందని తెలిపారు. మంత్రివర్గంలో ఖాళీలు తక్కువగా ఉన్నాయని.. ఆశావహులు మాత్రం ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.