తెలంగాణలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద మహిళలకు పంపిణీ చేయనున్న 95 లక్షల చీరల తయారీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 30 లక్షల చీరలు సిద్ధమై జిల్లాలకు తరలిస్తున్నారు. మిగిలిన చీరలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది నవంబరు 19న పంపిణీ చేపట్టగా.. ఈసారి అక్టోబరు మొదటి వారానికే సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే వచ్చే నెల 11న బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.334 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈసారి చిలకపచ్చ రంగు చీరలను ఎంపిక చేశారు.